అసభ్యకరంగా ప్రవర్తించాడు, ఫొటోలు తీశాడు

ముంబై : యువతి అనుమతి లేకుండా ఆమె ఫొటోలు తీయటమే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి సంవత్సరం జైలు శిక్ష విధించింది పోక్సో కోర్టు. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును కోర్టు శుక్రవారం వెలువరించింది. వివరాల్లోకి వెళితే..  2018 సంవత్సరంలో ముంబై తిలక్‌నగర్‌లో వాసిమ్‌ షేక్‌ అనే వ్యక్తి 17 ఏళ్ల  యువతి అనుమతి లేకుండా ఆమె ఫొటోలు తీశాడు. శరీరంపై తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కలి వారు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. శుక్రవారం జరిగిన కోర్టు విచారణలో బాధితురాలు మాట్లాడుతూ.. ‘‘  నా పదవ తరగతి పూర్తి చేసుకుని కంప్యూటర్‌ కోర్సులో చేరుదామని ప్లాన్‌ చేసుకుంటున్నా.